శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PNR
Last Updated : శుక్రవారం, 31 అక్టోబరు 2014 (16:19 IST)

ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం చేపట్టే ఆ 17 గ్రామాల పేర్లు ఇవే..!

నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం తొలిదశ పనులు కృష్ణా, గుంటూరు జిల్లాల పరిధిలోని 17 గ్రామాల్లో చేపట్టనున్నారు. ఈ గ్రామాలన్నీ మంగళగిరి, తుళ్లూరు మండలాల్లో ఉన్నాయి. ఈ నిర్మాణం కోసం ఈ గ్రామాల్లో సుమారు 30 వేల ఎకరాల భూమిని సేకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. నవ్యాంధ్ర రాజధానిగా అవతరించబోతున్న ఆ 17 గ్రామాలు ఇవే..
 
1. వెలగపూడి 2. రాయిపూడి 3. దొండపాడు 4. అబ్బురాజుపాలెం 5. లింగాయపాలెం 6. మూఢలింగాయపాలెం 7. ఉద్దండరాయునిపాలెం 8. నెక్కల్లు 9. నీరుకొండ 10. శాఖమూరు 11. కూరగల్లు 12. మందడం 13. మొలకాపురం 14. నేలపాడు 15. తుళ్లూరు 16. నిడమర్రు 17. బోరుపాలెం గ్రామాలు ఉన్నాయి. ఈ గ్రామాల్లో ఉన్న పంటపొలాలను ప్రభుత్వం సేకరించి రాజధానిని అంతర్జాతీయ సొబగులతో నిర్మించనుంది.