శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PNR
Last Updated : బుధవారం, 2 సెప్టెంబరు 2015 (10:12 IST)

వైఎస్ ఫోటో చూస్తేనే టీడీపీ నేతలకు పంచెలు తడిసిపోతున్నాయ్ : ఎమ్మెల్యే రోజా

దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఫోటో చూస్తేనే టీడీపీ నేతలకు పంచెలు తడిసిపోతున్నాయని వైకాపా ఎమ్మెల్యే ఆర్కే. రోజా అంటున్నారు. ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో భాగంగా బుధవారం శాసనసభా ఆవరణలో వైఎస్ చిత్రపటాన్ని తొలగించిన విషయంపై వైసీపీ నేతలు ఆందోళనకు దిగారు. వైఎస్ చిత్రపటాలున్న ప్లకార్డులను పట్టుకుని స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టారు. 
 
ఈ సందర్భగా ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు వైసీపీ నేతలపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అనంతరం విపక్ష నేతల నినాదాలతో సభను స్పీకర్ కోడెల శివప్రసాద్ సభను 10 నిమిషాల పాటు వాయిదా వేశారు. అపుడు అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద యనమల వ్యాఖ్యలపై స్పందించిన రోజా ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘‘వైఎస్ ఫొటో చూస్తే టీడీపీ నేతల పంచెలు తడిసిపోతున్నట్టున్నాయి. అందుకే ఆయన ఫొటో తీసేశారు. అసెంబ్లీ ఆవరణలో స్వర్గీయ నందమూరి తారకరారావు ఫొటోను పెట్టడం ఇష్టం లేకనే వైఎస్ ఫొటోను తీసేశారు’’ అని అన్నారు.