శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By TJ
Last Modified: మంగళవారం, 10 ఏప్రియల్ 2018 (16:34 IST)

మోడీకి మతి లేదు... ఆయన మా శత్రువు: ఉపముఖ్యమంత్రి సంచలన వ్యాఖ్యలు (Video)

ప్రధానమంత్రి నరేంద్రమోడీపై తీవ్రస్థాయిలో ఫైరయ్యారు ఎపి ఉప ముఖ్యమంత్రి కె.ఈ.క్రిష్ణమూర్తి. ఎపి అల్లకల్లోలంగా మారుతోంది. హోదా కోసం పోరాటం ఉధృతమవుతోంది. అయినాసరే కేంద్రం నుంచి అస్సలు స్పందన లేదు. మోడీకి మతే లేదు.. కనీస ఆలోచన అస్సలు లేదు అంటూ తీవ్రస్థాయి

ప్రధానమంత్రి నరేంద్రమోడీపై తీవ్రస్థాయిలో ఫైరయ్యారు ఎపి ఉప ముఖ్యమంత్రి కె.ఈ.క్రిష్ణమూర్తి. ఎపి అల్లకల్లోలంగా మారుతోంది. హోదా కోసం పోరాటం ఉధృతమవుతోంది. అయినాసరే కేంద్రం నుంచి అస్సలు స్పందన లేదు. మోడీకి మతే లేదు.. కనీస ఆలోచన అస్సలు లేదు అంటూ తీవ్రస్థాయిలో కె.ఈ. క్రిష్ణమూర్తి మండిపడ్డారు. 
 
ముఖ్యమంత్రితో పాటు తెలుగుదేశం పార్టీ నేతలందరూ ఢిల్లీలో తీవ్రస్థాయిలో ఆందోళనలు చేస్తుంటే మోడీ ఎందుకు పట్టించుకోవడం లేదంటూ ప్రశ్నించారు. కనీసం జరుగుతున్న పరిణామాలపై ఎవరినీ అడిగి తెలుసుకోకపోవడం బాధాకరమైన విషయమని, బిజెపితో మాకు విబేధాలు లేవని.. మోడీనే మాకు శత్రువన్నారు కె.ఈ.క్రిష్ణమూర్తి. వీడియో చూడండి...