శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By tj
Last Updated : ఆదివారం, 5 ఫిబ్రవరి 2017 (15:44 IST)

ప్రత్యేక హోదా ఏమైనా చాక్లెటా.. అడిగిందే ఇవ్వడానికి.. మంత్రి మాణిక్యాల రావు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ చూసినా ప్రత్యేక హోదా హాట్ టాపిక్‌గా మారింది. ప్రత్యేక హోదా కోసం ఒకవైపు పోరాటం చేస్తుంటే మరోవైపు ప్రత్యేక హోదా అవసరం లేదంటూ బీజేపీ, టీడీపీ నాయకులు చెబుతున్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ చూసినా ప్రత్యేక హోదా హాట్ టాపిక్‌గా మారింది. ప్రత్యేక హోదా కోసం ఒకవైపు పోరాటం చేస్తుంటే మరోవైపు ప్రత్యేక హోదా అవసరం లేదంటూ బీజేపీ, టీడీపీ నాయకులు చెబుతున్నారు. అయితే బీజేపీకి చెందిన ఏపీ దేవదాయశాఖామంత్రి మాణిక్యాల రావు మాత్రం ప్రత్యేక హోదా అంటే ఊగిపోతున్నారు. శనివారం తిరుపతిలో ప్రత్యేక హోదా వస్తుందా.. వెంకయ్య నాయుడే ప్రత్యేక హోదాను పదేళ్ళపాటు ఇస్తామని ప్రకటించారు... ఆ తర్వాత మాటమార్చారని చెప్పడంతో ఆయనకుక చిర్రెత్తుకొచ్చింది.
 
ముందు విలేకరులు మారండి.. మీరు ప్రతిపక్షాలకు కొమ్ముకాస్తున్నారు. ఇదేమైనా చాక్లెటా.. అడిగిందే తీసుకొచ్చి ఇవ్వడానికి. ఇప్పటికైనా మారండి అంటూ మీడియాను.. ప్రతిపక్షాలను ఏకిపారేశారు. ఒక మంత్రి హోదాలో ఉన్నామన్న విషయాన్ని మరిచిపోయిన మాణిక్యాలరావు ఆ విధంగా ప్రవర్తించడం బీజేపీ నాయకులనే ఆశ్చర్యానికి గురిచేసింది. ప్రత్యేక హోదా అవసరం లేదు. అభివృద్ధినే ప్రజలు కోరుకుంటున్నారు ఆ అభివృద్ధి ఏపీలో జరుగుతోందని వెళ్ళిపోయారు మాణిక్యాలరావు.