శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 12 మే 2017 (09:22 IST)

నిషిత్ కారు ప్రమాదాన్ని వీడియో తీసిన వ్యక్తి.. మీడియాకు అమ్మేందుకు యత్నాలు

ఏపీ మంత్రి పి.నారాయణ కుమారుడు నిషిత్ నారాయణ కారు ప్రమాదాన్ని ఓ గుర్తు తెలియని వ్యక్తి వీడియో తీశాడు. ఆ తర్వాత ఆ వీడియోను అమ్మేందుకు మీడియా సంస్థలకు ఫోన్ చేస్తున్నాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాల

ఏపీ మంత్రి పి.నారాయణ కుమారుడు నిషిత్ నారాయణ కారు ప్రమాదాన్ని ఓ గుర్తు తెలియని వ్యక్తి వీడియో తీశాడు. ఆ తర్వాత ఆ వీడియోను అమ్మేందుకు మీడియా సంస్థలకు ఫోన్ చేస్తున్నాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే.... 
 
బుధవారం తెల్లవారుజామున హైదరాబాద్‌లో ఏపీ మంత్రి నారాయణ కుమారుడు నిషిత్ కారు మెట్రోరైల్ పిల్లర్‌ను ఢీకొన్న విషయం తెల్సిందే. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నిషిత్, అతని స్నేహితుడు రాజా రవిచంద్రలు దుర్మరణం పాలయ్యారు. 
 
అయితే, ఈ ప్రమాద దృశ్యాలను యాదృచ్ఛికంగా ఆ సమయంలో అక్కడ ఉన్న ఒక వ్యక్తి ఇదే తరహాలో చిత్రీకరించారు. ‘ఆ వీడియో నా దగ్గర ఉన్నది కొంటారా’ అంటూ ఓ వార్తా సంస్థకు ఫోన్ చేసిన బేరసారాలకు దిగాడు.