ఏటిఎం పగులగొట్టి... నగదు చోరీ
చిల్లర గ్యాంగుకు కడప నగరంలోని ఓ ఏటిఎంపై కన్ను పడింది. పెద్దగా రద్దీలేని ప్రాంతం కావడంతో దాని పని పట్టాలనుకున్నారు. అందుకు గురువారం తెల్లవారుజామున ముహూర్త కుదుర్చుకున్నారు. నేరుగా వెళ్లి అందులోని మెషిన్లను బద్ధలుకొట్టి ఉన్న నగదుతో ఉడాయించారు. వివరాలిలా ఉన్నాయి.
కడప నగరంలోని అప్సర థియేటర్ రోడ్డులోని శివాలయం సమీపంలో ఉన్న ఏటీఎం ఎస్బీఐ ఏటిఎం ఉంది. ఇక్క పెద్దగా జనసంచారం ఉండదు. రాత్రిళ్లయితే అస్సలుండదు. గురువారం తెల్లవారుజామున కొంతమంది దొంగలు ప్రవేశించి రెండు ఏటీఎం యంత్రాలను పగులగొట్టి, నగదు దోచేశారు.
చోరీకి గురైన సొమ్ము లక్షల్లోనే ఉంటుందని అంచనా. అయితే బ్యాంకు అధికారులు ఇంకా లెక్కలు తీయలేదు. అధికారులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని, విచారణ ప్రారంభించారు.