శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PNR
Last Updated : మంగళవారం, 19 ఆగస్టు 2014 (10:11 IST)

ఊతకర్ర సహాయంతో హిందూపురం ఎమ్మెల్యే, హీరో బాలకృష్ణ

హిందూపురం ఎమ్మెల్యే, హీరో నందమూరి బాలకృష్ణ ఇటీవల ఓ సినిమా షూటింగ్‌ పాల్గొంటూ బైక్ మీద నుంచి జారి పడి గాయపడగా, ఆయన గాయానికి ఏడు కుట్లు పడిన విషయం తెల్సిందే. అయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ తొలిరోజు సమావేశాలకు బాలకృష్ణ ఊతకర్ర సాయంతో రావడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. బాలకృష్ణని టీడీపీ, వైసీపీలకు చెందిన శాసనసభ్యులు ఆయనను పరామర్శించారు.
 
ఆయనకు గాయం ఎలా అయ్యిందో... ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు. అడిగిన వారందరికీ సమాధానం చెబుతూ బాలకృష్ణ చాలా ఉత్సాహంగా కనిపించారు. అసెంబ్లీ వాయిదా పడిన తర్వాత బాలకృష్ణ, నటి రోజాలు పిచ్చాపాటిగా మాట్లాడుకుంటూ బయటకు రావడం విశేషం. రోజా టీడీపీలో చేరబోతున్నారన్న ఊహాగానాలు వినిపిస్తున్న తరుణంలో బాలకృష్ణ, రోజా ఇలా ముచ్చటించుకోవడం చర్చనీయాంశంగా మారింది.