శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 24 అక్టోబరు 2014 (18:54 IST)

తెలంగాణ రాష్ట్రంలో దొంగలు పడ్డారు: మల్లు భట్టి విక్రమార్క ఫైర్

తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీపై కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్యే మల్లు భట్టి విర్రమార్క ఫైర్ అయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో దొంగలు పడ్డారని భట్టి విక్రమార్క తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణలో ప్రజలు అధికారం ఇస్తే.. తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టిందని విమర్శించారు. 
 
రాష్ట్రంలోని వనరులను ఒక కుటుంబం దోపిడీ చేస్తోందని ఆరోపించారు. ఛత్తీస్‌గఢ్ నుంచి విద్యుత్ తీసుకొస్తామన్న ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు, ఎందుకు తీసుకురావడం లేదని ప్రశ్నించారు. 
 
డెంగ్యూ, ఇతర వైరల్ వ్యాధులతో ప్రజలు బాధపడుతుంటే, మంత్రి రాజయ్య మాట్లాడుతూ.. డెంగ్యూ వ్యాధి రాష్ట్రంలో లేదని చెప్పడం హాస్యాస్పదమన్నారు.