శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 1 జూన్ 2016 (11:41 IST)

చంద్రబాబు నిజాయితీపరుడు.. జగన్‌కు విజయసాయికి లింకేంటి? భూమా నాగిరెడ్డి ప్రశ్న

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి నాలుగో రాజ్యసభ అభ్యర్థిని పోటీకి నిలబెట్టాలని తాము గట్టిగా కోరినా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంగీకరించలేదని, వైకాపా నుంచి టీడీపీలో చేరిన ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి అన్నారు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి నాలుగో రాజ్యసభ అభ్యర్థిని పోటీకి నిలబెట్టాలని తాము గట్టిగా కోరినా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంగీకరించలేదని, వైకాపా నుంచి టీడీపీలో చేరిన ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి అన్నారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ.. 'రాజ్యసభ ఎన్నికల్లో నాలుగో అభ్యర్థిని పెట్టాలని కోరడానికి మేమంతా ఆయన వద్దకు వెళ్లాం. మేం గెలిపించి తీసుకొస్తామని చెప్పినా ఆయన వినలేదన్నారు. 
 
అటువంటి గెలుపు అవసరం లేదని, పోటీ అక్కర్లేదని చెప్పారు. నిర్ణయం మాకు వదిలిపెడుతూనే తనకు మాత్రం పోటీ పెట్టడం ఇష్టం లేదని స్పష్టంగా చెప్పారు. గెలిచే అవకాశం ఉన్నప్పుడు ఆయన ఇటువంటి వైఖరి తీసుకోవడం మాకు ఆశ్చర్యం కలిగించింది. జగన్ తన ఇంటి వ్యవహారాలు చక్కదిద్దుకోవడానికి తన ఆడిటర్‌ను ఎంపీగా పెట్టడం ఏమిటి? పార్టీకి, ఆయనకు ఏం సంబంధం? ఇక పార్టీలో పనిచేసే నాయకులు ఏం కావాలి' అని నాగిరెడ్డి ప్రశ్నించారు.