మంగళవారం, 16 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By TJ
Last Modified: శనివారం, 6 జనవరి 2018 (14:56 IST)

ఖబడ్దార్ చంద్రబాబు... పురంధరేశ్వరి ఆసక్తికర వ్యాఖ్యలు

ఏపీలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల్లో కేంద్రం ఇచ్చే నిధులే 75 శాతానికి పైగా ఉన్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రాల అభివృద్థి కోసం ప్రత్యేకంగా దృష్టి సారించడమే కాదు అన్ని రాష్ట్రాలకు కావాల్సినంత నిధులను సమకూరుస్తుంటే చంద్రబాబుతో పాటు టిడిపి నేతలు

ఏపీలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల్లో కేంద్రం ఇచ్చే నిధులే 75 శాతానికి పైగా ఉన్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రాల అభివృద్థి కోసం ప్రత్యేకంగా దృష్టి సారించడమే కాదు అన్ని రాష్ట్రాలకు కావాల్సినంత నిధులను సమకూరుస్తుంటే చంద్రబాబుతో పాటు టిడిపి నేతలు కేంద్రంపై విమర్శలు చేస్తారా. భారతీయ జనతా పార్టీని హీనంగా మాట్లాడతారా. ఖబడ్దార్ చంద్రబాబు... తెలుగుదేశం పార్టీ నేతల్లారా... మరోసారి ఇలాంటివే చేస్తే వచ్చే ఎన్నికల్లో మీతో దోస్తీ ఉండదు.
 
ఎపిలోని అన్ని నియోజకవర్గాల్లో బిజెపి పోటీ చేస్తుంది. మా సత్తాను మేము చాటుతాం. బిజెపి అంటే ఏంటో నిరూపిస్తామంటూ బిజెపి నాయకురాలు, ఎన్టీఆర్ కుమార్తె పురంధరేశ్వరి అన్నారు. గత కొన్నిరోజుల నుంచి టిడిపిపై తీవ్రస్థాయిలో బిజెపి నాయకులు విమర్శలు చేస్తున్నారు. 
 
బిజెపి ఎమ్మెల్సీ సోము వీర్రాజు అయితే టిడిపి నేతలందరినీ వరుస పెట్టి తిట్టడం ప్రారంభించారు. ఇప్పుడు పురంధరేశ్వరి ప్రారంభించారు. ఇలా బిజెపి, టిడిపి నాయకుల మధ్య వాగ్వాదం పెరుగుతుండటం చూస్తుంటే వచ్చే ఎన్నికల్లో వీరు కలిసి పోటీ చేయడం సాధ్యమయ్యేదిలా కనిపించడం లేదు.