శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ivr
Last Updated : గురువారం, 21 ఆగస్టు 2014 (22:51 IST)

జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ - భాజపా అధ్యక్షుడు అమిత్ భేటీ

టాలీవుడ్ పవర్ స్టార్, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సమావేశం అవుతున్నట్లు సమాచారం. అమిత్ షా రెండు రోజుల పాటు హైదరాబాదులో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా అమిత్ షా హోటల్ హరితలో పవన్ కల్యాణ్ తో సమావేశమవుతున్నారని పార్టీ వర్గాలు చెపుతున్నాయి. వీరిద్దరి భేటీలో విశాఖ ఎంపీ హరిబాబు కూడా పాల్గొంటారని తెలుస్తోంది. 
 
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నేపధ్యంలో పవన్ కళ్యాణ్ మద్దతు కోసం అమిత్ ఆయనను కలుస్తున్నట్లు సమాచారం. కాగా మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో పవన్ కల్యాణ్ టీడీపీ-బీజేపీ పార్టీలకు మద్దతుగా ప్రచారం చేసిన విషయం తెలిసిందే. ప్రచార సభలకు ప్రధాని నరేంద్ర మోడీ, ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు పవన్ కల్యాణ్ ఆంధ్రప్రదేశ్ లో సుడిగాలి పర్యటన చేసి ఆ రెండు పార్టీల గెలుపుకు పాటుపడిన సంగతి తెలిసిందే. కాగా ఇప్పుడు జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తొలిసారిగా హైదరాబాదు పర్యటనకు వచ్చిన నేపథ్యంలో పవన్ తో భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.