విజయవాడలో బ్లూ ఫిల్మ్ తీసే ముఠా అరెస్ట్!
ఒకవైపు మహిళలపై అత్యాచారాలు పెచ్చరిల్లిపోతుంటే., మరోవైపు సైబర్ క్రైమ్లు సైతం పెరిగిపోతున్నాయి. కృష్ణా జిల్లా విజయవాడ నగరంలో నీలిచిత్రాల వ్యాపారం చేస్తున్న ముఠా సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు.
మతిస్థిమితంలేని బాలిక, రాంచరణ్ అనే యువకుడిని అదుపులోకి తీసుకున్న టాస్క్ఫోర్స్ పోలీసులు వారిని రహస్యంగా విచారిస్తున్నారు. ముఠాకు చెందిన మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. ముఠా సభ్యులో ఒకరైన రాంచరణ్ను గతంలో ఓసారి పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.
మరోవైపు గుంటూరు జిల్లాలోని చౌడవరం వద్ద గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆర్వీఆర్జేసీ కాలేజీకి చెందిన బీటెక్ విద్యార్థి అనిల్ మృతి చెందాడు. అనిల్ ప్రయాణిస్తున్న ద్విచక్రవాహనాన్ని గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.