శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pyr
Last Updated : మంగళవారం, 30 జూన్ 2015 (18:34 IST)

ఇద్దరు దొంగలే.. చంద్రబాబు దొరికారు.. కేసీఆర్ దొరకలేదంతే.. డిగ్గీ రాజా

వాళ్లు ఇద్దరూ దొంగలే... కాకపోతే ఇందులో చంద్రబాబు పట్టుబడ్డారు. కేసీఆర్ పట్టుబడలేదంతేనని కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ అన్నారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. 
 
ఓటుకు కోట్లు కేసులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు రెడ్ హ్యాండెడ్ గా దొరికితే.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం దొరకలేదని దిగ్విజయ్ ఎద్దేవా చేశారు. నామినేటేడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ తో మాట్లాడింది చంద్రబాబా కాదా అన్నది ఆయనే స్పష్టం చేయాలన్నారు.
 
ఓటుకు కోట్లు కేసులో సీబీఐతో విచారణ జరిపించాలని కాంగ్రెస్ మరోసారి డిమాండ్ చేసింది. ఈ కేసులో సీబీఐ విచారణ కోరుతూ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం వేస్తామని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ తెలిపారు.