శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PNR
Last Updated : శనివారం, 28 మార్చి 2015 (14:32 IST)

ఢిల్లీ మెట్రో రైలులో చంద్రబాబు.. వైజాగ్ - విజయవాడలకు మెట్రో రైలు

ఢిల్లీ పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం ఉదయం మెట్రోను పరిశీలించారు. అనంతరం శివాజీ స్టేడియం నుంచి ఢిల్లీ విమానాశ్రయం వరకు మెట్రో రైలులో చంద్రబాబు ప్రయాణించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మెట్రో ప్రయాణం సౌకర్యంగా ఉందన్నారు. 
 
ఎప్పటి నుంచో ఢిల్లీ మెట్రోను చూడాలనుకున్నట్లు చెప్పారు. మెట్రోతో సమయం ఆదా, పొల్యూషన్‌ ఉండదని బాబు తెలిపారు. దేశంలో అధిక జనాభా దృష్ట్యా మరిన్ని మెట్రోలు రావాలని చంద్రబాబు ఆకాంక్షించారు. విశాఖ, విజయవాడల్లో అత్యున్నత ప్రమాణాలతో మెట్రో ప్రాజెక్టును తీసుకువస్తామన్నారు. అందుకోసం ప్రపంచంలోని అగ్రశ్రేణి నగరాలలో మెట్రోలను పరిశీలిస్తామని, ఢిల్లీ మెట్రోను కూడా మరోసారి పరిశీలిస్తామని చంద్రబాబు వెల్లడించారు.