శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 6 అక్టోబరు 2015 (10:32 IST)

ఏపీ రాజధాని శంకుస్థాపనకు మోడీ వస్తారు: చంద్రబాబు

నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి శంకుస్థాపనకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వస్తారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. శంకుస్థాపనకు వస్తానని మోడీ అంగీకరించారని ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు చెప్పారు. మోడీతో భేటీ సందర్భంగా రాజధాని నిర్మాణానికి సంబంధించిన పూర్తి వివరాలను మోడీకి తెలియజేశానన్నారు. 
 
నెంబర్ వన్ రాజధాని నిర్మాణమే తమ లక్ష్యమని చంద్రబాబు తెలిపారు. అందుకు ప్రజల భాగస్వామ్యాన్ని కోరుకుంటున్నామని తెలిపారు. ముఖ్యంగా రాజధాని నిర్మాణానికి రైతులు హృదయ పూర్వకంగా తమ భూములిచ్చిన విషయాన్ని మోడీ వద్ద ప్రస్తావించినట్లు తెలిపారు. కాగా చంద్రబాబు ఢిల్లీ పర్యటన ముగియడంతో విజయవాడకు బయల్దేరారు. శంకుస్థాపనతో పాటు తిరుపతి వచ్చేందుకు కూడా ప్రధాని అంగీకరించారని బాబు చెప్పారు.