1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 24 జులై 2019 (16:50 IST)

మా ప్రాంతవాసుల వినతులు ఇవిగో... రైల్వే మంత్రితో కోమటిరెడ్డి భేటీ

కేంద్ర రైల్వే మంత్రి పియూష్ గోయల్‌తో కాంగ్రెస్ పార్టీకి చెందిన భువనగిరి లోక్‌సభ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బుధవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన తన ప్రాంతవాసుల వినతులను ఓ పత్రంలో అందజేశారు. 
 
ముఖ్యంగా, శాతవాహన, పద్మావతి, గోదావరి, మచిలీపట్నం రైళ్లను భువనగిరి, జనగామ, ఆలేరు రైల్వేస్టేషన్‌లలో ఆపాలని మంత్రికి విజ్ఞప్తి చేశారు. ఈ ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కు ప్రతిరోజు 30 వేలకు పైగా జనాభా ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలలో పనిచేసే ఉద్యోగులు, విద్యార్థులు, వ్యాపారస్తులకు, రోజువారి కూలీలు అనునిత్యం వళ్లి వస్తుంటారు. వీరంతా సరైన రైలు సౌకర్యం లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 
 
రాష్ట్ర నలుమూలల నుండి ప్రతిరోజు యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దర్శనం కోసం 50 వేల మందికి పైచిలుకు భక్తులు వస్తుంటారు. రైల్వే సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నారని కేంద్ర మంత్రికి వివరించారు. మంత్రి వెంటనే స్పందించి సంబంధిత అధికారులతో సర్వేలు చేపించి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.