1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : శనివారం, 22 డిశెంబరు 2018 (09:06 IST)

చెవిటి - మూగ యువతిని ఎత్తుకెళ్లి రేప్ చేసిన కామాంధుడు

తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా ఎర్రుపాలెంలో ఓ మూగ, చెవిటి యువతిని ఓ కామాంధుడు బలవంతంగా ఎత్తుకెళ్లి అత్యాచారం చేశాడు. కిరాణా సరుకులు కొనుగోలు చేసేందుకు వచ్చిన ఈ యువతిని చెరబట్టి.. ఈ పాడుపనికి పాల్పడ్డాడు. ఇపుడు జైలు ఊచలు లెక్కిస్తున్నాడు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా వీర్లపాడు మండలం దొడ్డదేవరపాడు గ్రామానికి చెందిన నండ్రు ప్రకాశరావు (35) అనే వ్యక్తి శుక్రవారం పెగళ్లపాడు గ్రామంలోని తన బంధువుల ఇంటికి వచ్చాడు. ఇదే గ్రామానికి చెందిన 19 యేళ్ళ చెవిటి, మూగ యువతి ఉదయం 11 గంటల సమయంలో కిరాణా షాపు వద్దకు వచ్చి ఇంట్లోకి కావాల్సిన సరుకులు కొనుక్కుని తిరిగి వెళ్తోంది. 
 
ఆ సమయంలో బజారు నిర్మానుష్యంగా ఉండటాన్ని గమనించిన ప్రకాశ రావు సదరు యువతిని బలవంతంగా ఎవరూలేని ఇంట్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేసి.. అక్కడి నుంచి పరారయ్యాడు. ఆ తర్వాత ఆ యువతి విలపిస్తూ ఇంటికి వెళ్లి జరిగిన విషయాన్ని సైగలతో వెల్లడించింది. 
 
దీంతో దిగ్భ్రాంతికి గురైన యువతి తల్లి.. సంఘటనా స్థలం వద్దకు వెళ్లి అతడి కోసం వెతికి... ఎవరూ కనిపించకపోవడంతో... పోలీసులకు సమాచారం అందించింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న ప్రకాశరావు కోసం గాలిస్తున్నారు.