శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 4 అక్టోబరు 2015 (14:57 IST)

దీక్ష చేసే అర్హత జగన్ మోహన్ రెడ్డికి ఉందా : ధూళిపాళ్ల నరేంద్ర

ఒక్క ప్రత్యేక హోదా మాత్రమే కాదు, ఏ అంశంపైనా అయినా దీక్ష చేసే అర్హత వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డికి ఉందా అని టీడీపీ నేత ధూళిపాళ్ళ నరేంద్ర ప్రశ్నించారు. ఇదే అంశంపై ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడుతూ దీక్షల పేరుతో రాష్ట్ర ప్రజలను జగన్ మోసం చేస్తున్నారని విమర్శించారు. ప్రత్యేక హోదా ఇచ్చేది రాష్ట్రం కాదు కేంద్రమనే విషయాన్ని జగన్ గ్రహించాలన్నారు. ఇందుకోసం ఢిల్లీలో చేయాలే కానీ, గల్లీల్లో కాదన్నారు.  
 
రాష్ట్రంలో అమాయక యువతను బలి చేయడానికే జగన్ దీక్ష చేపడుతున్నారని మండిపడ్డారు. 8 మంది ఎంపీలున్న జగన్ ఢిల్లీలో ఎందుకు దీక్ష చేయడం లేదని ఆయన ప్రశ్నించారు. టీడీపీ కేంద్ర కేబినెట్‌ నుంచి వైదొలిగితే జగన్ చేరాలని చూస్తున్నారని, అవినీతి, అరాచకాలకు లోటస్ పాండ్ అడ్డా అని ధూళిపాళ్ల నరేంద్ర ఆరోపించారు. అందుకు అనుగుణంగానే జగన్ అడుగులు వేస్తున్నారని విమర్శించారు. కానీ, జగన్ కలలు పగటి కలలుగానే మిగిలిపోతాయని ధూళిపాళ్ళ జోస్యం చెప్పారు.