శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 2 సెప్టెంబరు 2014 (13:28 IST)

బాపు అంత్యక్రియలు పూర్తి: చెన్నై బెసంట్ నగర్లో అభిమానుల వెల్లువ!

ప్రముఖ దర్శకుడు, చిత్రకారుడు బాపు అంత్యక్రియలు చెన్నై బీసెంట్ నగర్ శ్మశాన వాటికలో పూర్తయ్యాయి. ఇద్దరు కుమారులు ఆయనకు దహన సంస్కారాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, రావి కొండలరావు, బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్, అనిల్ కపూర్, సినీ ప్రముఖులు... ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తరపున ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్, మంత్రి పల్లె రఘునాథరెడ్డి హాజరయ్యారు. 
 
అంతకుముందు నిర్వహించిన బాపు అంతిమయాత్రలోనూ పలువురు అభిమానులు పాల్గొన్నారు. బాపు అంత్యక్రియల నేపథ్యంలో చెన్నై బెసంట్ నగర్ ప్రాంతం అభిమానులతో నిండిపోయింది. బాపుకు కన్నీటి వీడ్కోలు పలికేందుకు భారీ స్థాయిలో సినీ తారలు, ప్రముఖులు, అభిమానులు తరలివచ్చారు.