శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 28 ఫిబ్రవరి 2017 (10:47 IST)

నిద్రమత్తులో డ్రైవర్.. రెండు కల్వర్టుల మధ్య బస్సు.. కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Video)

కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మంగళవారం తెల్లవారుజామున 5.45 గంటల సమయంలో జిల్లాలోని పెనుగంచిప్రోలు మండలం ముళ్లపాడులోని ఓ కల్వర్టు వద్ద ఈ ప్రమాదం సంభవించింది. విజయవాడ నుంచి హైదరాబాద్‌కు వె

కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మంగళవారం తెల్లవారుజామున 5.45 గంటల సమయంలో జిల్లాలోని పెనుగంచిప్రోలు మండలం ముళ్లపాడులోని ఓ కల్వర్టు వద్ద ఈ ప్రమాదం సంభవించింది. విజయవాడ నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న దివాకర్ ట్రావెల్స్ బస్సు ఫ్లైఓవర్‌పై నుంచి కిందపడింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 8 మంది మృతి చెందారు. వీరిలో ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. పలువురికి గాయాల్యాయి. క్షతగాత్రులను నందిగామ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. 
 
వీరిలో ప్రాణాపాయ స్థితిలో ఉన్న 10 మందిని గొల్లపూడి ఆంధ్రా ఆస్పత్రికి తరలించారు. ప్రమాదస్థలిలో సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. డ్రైవర్‌ నిద్రమత్తులో ఉండటంతో పాటు.. బస్సు వేగంగా వెళుతుండగా, అదుపుతప్పి రెండు కల్వర్టుల మధ్య పడిపోయింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరకుని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని వారు తెలిపారు.
 
కాగా, ఈ బస్సు ప్రమాద ఘటనపై డిప్యూటీ సీఎం చినరాజప్ప ఆరా తీశారు. తక్షణమే ప్రమాదస్థలికి వెళ్లిసహాయ చర్యలు చేపట్టాలని జిల్లా అధికారులను ఆదేశించారు. మెరుగైన వైద్య సేవల కోసం అవసరమైతే క్షతగాత్రులను విజయవాడకు తరలించాలని అధికారులకు మంత్రి సూచించారు. మృతదేహాలకు తక్షణమే పోస్టుమార్టం చేసి స్వస్థలాలకు పంపించే ఏర్పాటు చేయాలని కూడా అధికారులను చినరాజప్ప ఆదేశించారు.