రామోజీదే పైచేయి...! ఎందులో...?
హైదరాబాద్: తెలుగులో ఈనాడు దినపత్రిక తన స్టామినా మరోసారి చూపించింది. తాజాగా రిలీజ్ అయిన ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్ ఏబీసీ వెల్లడించిన గణాంకాల ప్రకారం తెలుగు మీడియా రంగంలో ఈనాడు ఎవ్వరికీ అందనంత ఎత్తులో నిలిచింది. మరోసారి రామోజీ మీడియా మొఘల్
హైదరాబాద్: తెలుగులో ఈనాడు దినపత్రిక తన స్టామినా మరోసారి చూపించింది. తాజాగా రిలీజ్ అయిన ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్ ఏబీసీ వెల్లడించిన గణాంకాల ప్రకారం తెలుగు మీడియా రంగంలో ఈనాడు ఎవ్వరికీ అందనంత ఎత్తులో నిలిచింది. మరోసారి రామోజీ మీడియా మొఘల్ అనిపించుకున్నారు. దేశం మొత్తంమీద ప్రతిరోజు డైలీ పేపర్ల సర్క్యులేషన్ సంఖ్య 7 కోట్లుగా ఉంది.
ఈ 7 కోట్లలో తెలుగు పత్రికల సర్క్యులేషన్ వాటా దాదాపు 40 లక్షలు. వీటిలో ఈనాడు ఏ పత్రికకు అందనంత ఎత్తులో 18 లక్షల సర్క్యులేషన్తో ఉంది. ఇక రెండో స్థానంలో వైకాపా అధినేత జగన్కు చెందిన సాక్షి పత్రిక ఉంది. సాక్షి ఈనాడుకు చాలా దూరంలో 11.50 సర్క్యులేషన్ ఉంది. తెలుగులో మొత్తంగా అన్ని పేపర్ల సర్క్యులేషన్ల సంఖ్య 40 లక్షలు ఉంటే... ఈనాడు, సాక్షి కలిపే 30 లక్షల సర్య్కులేషన్ను సొంతం చేసుకున్నాయి.