శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PNR
Last Updated : మంగళవారం, 1 సెప్టెంబరు 2015 (17:27 IST)

నా సీనియర్స్ వల్లే చనిపోతున్నా... ర్యాగింగ్‌ను ఆపండి : విద్యార్థి సాయినాథ్

ర్యాగింగ్‌కు మరో విద్యార్థి బలయ్యాడు. ఈ దఫా తెలంగాణ రాష్ట్రంలో ఈ దారుణం చోటుచేసుకుంది. గుంటూరు జిల్లా కేంద్రంలోని నాగార్జున విశ్వవిద్యాలయంలో బీఆర్క్ మొదటి సంవత్సరం చదువుతూ వచ్చిన రిషితేశ్వరి సీనియర్ విద్యార్థుల ర్యాగింగ్‌ను భరించలేక ఆత్మహత్య చేసుకున్న విషయంతెల్సిందే. ఇది రాష్ట్రంలోనే కాకుండా దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ర్యాగింగ్ ఆత్మహత్య కేసు మరచిపోకముందే... వరంగల్ జిల్లా కాజీపేట రైల్వే స్టేషన్‌లో ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 
 
హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీకి చెందిన టెక్నికల్ క్యాంపస్‌లో మొదటి సంవత్సరం చదువుతున్న ఈ విద్యార్థిని సీనియర్ విద్యార్థులు ర్యాగింగ్ చేయడం వల్ల ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ మేరకు మృతదేహం వద్ద పోలీసులు స్వాధీనం చేసుకున్న పర్సులో సూసైడ్ నోటు రాసిపెట్టి ఈ దారుణానికి పాల్పడ్డాడు. "ఆ రోజున నా సీనియర్స్ ఆ విధంగా ప్రవర్తించకుండా ఉంటే నాకు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదని" అందులో రాశాడు. 
 
కాగా, ఈ ర్యాగింగ్‌ మృతిపై పూర్తి స్థాయి దర్యాప్తు కోసం పోలీసులు రంగంలోకి దిగారు. ఇందులోభాగంగా ఇప్పటికే మృతదేహంతో పాటు.. ఆత్మహత్యా స్థలంలో లభించిన సూసైడ్ నోట్, ఇతర ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.