ప్రేమించాడు.. వాడుకున్నాడు.. పెళ్లి మాటెత్తగానే పరార్ : ఈవెంట్ నిర్వాహకుడి అరెస్టు
పశ్చిమ గోదావరి జిల్లాలో ఓ యువతిని ప్రేమ పేరుతో మోసం చేసిన యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ వివరాలను పరిశీలిస్తే... పశ్చిమగోదావరి జిల్లా ఏలూరుకు చెందిన అడప శ్యాంకుమార్ రెడ్డి కేపీహెచ్బీ 6వ పేజ్లో నివసిస్తూ ఈవెంట్ నిర్వాహకుడిగా పనిచేస్తున్నాడు. సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్న యువతిని ప్రేమించాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి నిశ్చితార్థం కూడా చేసుకున్నాడు.
వరకట్నం కింద రూ.5 లక్షలు డబ్బులు కూడా తీసుకున్నాడు. కొద్దిరోజులక్రితం మరో యువతిని వివాహం చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ శ్యాంకుమార్రెడ్డి, తల్లిదండ్రులు, వివాహానికి సహకరించిన అతడి స్నేహితుడు సతీష్పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకొని శ్యాంకుమార్రెడ్డి, సతీష్ను అరెస్టు చేశారు.