చంద్రబాబు సమక్షంలో టీడీపీలో జాయిన్ అయిన మాజీ మంత్రి గాదె..
కాంగ్రెస్ నాయకుడు, మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి టీడీపీలో చేరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో ఆయన పసువు కండువా కప్పుకున్నారు. కాపు నేతగా గాదె వెంకటరెడ్డికి పేరుంది. ఒక పక్క కాపు ఉద్యమాలు నడుస్తున్న తరుణంలో వాటికి కౌంటర్గా గాదె వెంకటరెడ్డిని టీడీపీలో చేర్చుకున్నారనే రాజకీయ వ్యాఖ్యలు వెలువడుతున్నాయి. గుంటూరులో జరిగిన ఒక కార్యక్రమంలో గాదె వెంకటరెడ్డి సీఎం చంద్రబాబును కలిసి పార్టీలో చేరారు.