శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 1 ఆగస్టు 2016 (09:36 IST)

ప్రకాశంలో వివాహితపై సామూహిక అత్యాచారం.. కూల్‌ డ్రింక్స్‌లో మత్తుమందిచ్చి..?!

వివాహితకు వేరే వ్యక్తితో ఏర్పడిన పరిచయం ఆమె కొంపముంచింది. ఏదో బాగా మాట్లాడుతున్నాడు కదా పరిచయం చేసుకుంది. కానీ ఆ పరిచయమే వివాహితపై లైంగిక దాడికి కారణమైంది. అంతేగాకుండా ఆ వివాహితపై నలుగురు సామూహిక అత్య

వివాహితకు వేరే వ్యక్తితో ఏర్పడిన పరిచయం ఆమె కొంపముంచింది. ఏదో బాగా మాట్లాడుతున్నాడు కదా పరిచయం చేసుకుంది. కానీ ఆ పరిచయమే వివాహితపై లైంగిక దాడికి కారణమైంది. అంతేగాకుండా ఆ వివాహితపై నలుగురు సామూహిక అత్యాచారానికి పాల్పడేలా చేసింది. ఈ ఘటన ప్రకాశం జిల్లాలో చోటుచేసుకుంది.

ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలంలోని వెల్లలచెరువు గ్రామానికి చెందిన మహిళకు అదే గ్రామానికి చెందిన వ్యక్తితో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. అయితే ఆ మహిళకు అదే గ్రామానికి చెందిన మరో వ్యక్తితో సాన్నిహిత్యం ఉంది. 
 
దీన్ని అదనుగా తీసుకుని మూడు రోజుల పాటు నలుగురు వ్యక్తులు ఆమెకు శీతల పానీయంలో మద్యం కలిపి ఊరు బయటికి తీసుకెళ్లి గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు. దీంతో అనారోగ్యం పాలైన బాధితురాలిని బంధువులు నర్సారావు పేట ఆస్పత్రిలో చికిత్స అందించారు. అనంతరం బాధితురాలు కోలుకుని బంధువులకు, పోలీసులకు వివరాలు తెలిపింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.