శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : శనివారం, 22 నవంబరు 2014 (18:02 IST)

హుదూద్ బాధితులకు సమంత రూ. 10 లక్షలు!

విశాఖను అతలాకుతలం చేసేసిన హుదూద్ తుపాను బాధితుల సహాయార్థం సినీ నటి సమంత రూ.10లక్షల విరాళం ప్రకటించారు. విశాఖపట్టణాన్ని అతలాకుతలం చేసిన 'హుదూద్' తుపాను బాధితులకు సహాయం చేసేందుకు సినీ ప్రముఖులు చాలామంది ముందుకొచ్చారు.
 
సమంత గతంలో ప్రకటించిన విధంగానే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును కలిసిన సమంత 10 లక్షల రూపాయల చెక్కును అందజేశారు. వితరణ, సేవా కార్యక్రమాల్లో సమంత ఇతర సినీ నటులకు ఆదర్శంగా ఉన్న సంగతి తెలిసిందే.