శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 5 జూన్ 2020 (13:43 IST)

హెచ్‌ఐవీ పేషెంట్లు పెళ్లి చేసుకున్నారు.. వారానికే విడిపోయారు..

హెచ్‌ఐవీ పేషెంట్లు పెళ్లి చేసుకున్నారు. కానీ వారానికే విడిపోయారు. ఈ ఘటన మహబూబ్ నగర్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మహబూబ్ నగర్ జిల్లా గద్వాలకు చెందిన ఓ వ్యక్తి హెచ్ఐవీతో బాధపడుతున్నారు. నెలలో రెండుమూడు సార్లు మహబూబ్ నగర్‌లోని కౌన్సెలింగ్ కేంద్రానికి వచ్చేవాడు. ఇదే క్రమంలో మహబూబ్ నగర్‌కు చెందిన ఓ యువతి సైతం కౌన్సెలింగ్ కేంద్రానికి వెళ్లేది. 
 
ఈ క్రమంలో వీరిద్దరిని కౌన్సెలింగ్ కేంద్రం సిబ్బంది సమన్వయం కుదిర్చి ఫిబ్రవరి ఒకటో తేదీన వివాహం జరిపించారు. భార్యభర్తలిద్దరూ వారం రోజుల పాటు బాగానే కాపురం చేశారు. ఆ తర్వాత ఏమైందో గానీ ఓ రోజు భర్త సినిమాకు వెళ్తునానంటూ బయటకు వెళ్లాడు. మూడు నెలలైనా ఇంతవరకు తిరిగి ఇంటికి రాలేదు. దీంతో భార్య అత్తారింటి ఎదుట ఆందోళనకు దిగింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.