శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 27 జూన్ 2017 (12:21 IST)

శిరీషపై అత్యాచారం జరిగిందా? : డీసీపీ ఏమంటున్నారు?

హైదరాబాద్ బ్యూటీషియన్‌ శిరీషపై అత్యాచారం జరిగిందో లేదో తేల్చుతామని హైదరాబాద్ నగర డీసీపీ వెంకటేశ్వర రావు స్పష్టం చేశారు. ఈ కేసులో పోలీసులపై లేనిపోని విమర్శలు చేయవద్దని ఆయన హెచ్చరించారు.

హైదరాబాద్ బ్యూటీషియన్‌ శిరీషపై అత్యాచారం జరిగిందో లేదో తేల్చుతామని హైదరాబాద్ నగర డీసీపీ వెంకటేశ్వర రావు స్పష్టం చేశారు. ఈ కేసులో పోలీసులపై లేనిపోని విమర్శలు చేయవద్దని ఆయన హెచ్చరించారు. 
 
ఈ ఆత్మహత్య కేసు వివాదాస్పదంగా మారిన విషయం తెల్సిందే. ఈ కేసులో శిరీష బంధువులు లేనిపోని విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారు. దీంతో డీసీపీ స్పందించారు. శిరీష అనుమానాస్పద మృతి విషయంలో విచారణను వేగవంతం చేశామన్నారు. నిందితులు రాజీవ్, శ్రవణ్‌లతో పాటు పలువురిని ప్రశ్నించామని తెలిపారు. 
 
ఈ కేసులో అనవసర విమర్శలు చేయవద్దని హెచ్చరించారు. శిరీష బంధువులకు ఏమైనా అనుమానాలు ఉంటే హైదరాబాద్‌కు రావాలని, వారి అనుమానాలన్నీ నివృత్తి చేస్తామని తెలిపారు. శిరీష పంపిన వాట్స్‌యాప్ లొకేషన్ కుకునూరుపల్లి పీఎస్ క్వార్టర్స్ దేనని మరోసారి స్పష్టం చేసిన ఆయన, ఆమెపై అత్యాచారం జరిగిందా? లేదా? అన్న విషయం ఫోరెన్సిక్ నివేదిక వచ్చిన తరువాతనే తెలుస్తుందన్నారు.