శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 27 నవంబరు 2014 (15:39 IST)

నగ్నంగా ఫోటో తీశారా? ఎవరు చెప్పేది నిజం?

దేశంలో మహిళలపై దురాగతాలు పెచ్చరిల్లిపోతున్నాయి. మరోవైపు అదే అదనుగా తీసుకుని మహిళలు సైతం బ్లాక్ మెయిల్‌కు దిగుతున్నారు. తాజాగా నగ్నంగా ఫోటో తీశారంటూ ఓ యువతి ఆరోపిస్తుండగా, డబ్బు కోసం ఆమె బ్లాక్ మెయిల్ చేస్తోందంటూ ఆసుపత్రి యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసిన ఘటన హైదరాబాదులో జరిగింది.
 
ఈసీఐఎల్లోని జినియా ఆసుపత్రి యజమాని తనను నగ్నంగా ఫోటో తీశారని, తన నగ్నదేహాన్ని చిత్రీకరించినందుకు 50 లక్షల రూపాయలు ఇవ్వాలంటూ ఓ యువతి డిమాండ్ చేస్తుండడంతో, ఆసుపత్రి యజమాని పోలీసులను ఆశ్రయించాడు.
 
తనను బ్లాక్ మెయిల్ చేస్తోందంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో, రంగంలోకి దిగిన పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు జరుపుతున్నారు.