మహిళా జడ్జిని నగ్నఫోటోలున్నాయని బెదిరించిన.. జూనియర్ అడ్వకేట్.. ఆపై..?
సామాన్య మహిళలే కాదు.. మహిళా జడ్జిలకు కూడా వేధింపులు తప్పలేదు. నువ్వు స్నానం చేస్తుండగా తీసిన నగ్న ఫోటోలు తన వద్ద ఉన్నాయని బ్లాక్ మెయిల్ చేసిన వ్యక్తి హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసుల చేతికి చిక్కాడు. వ
సామాన్య మహిళలే కాదు.. మహిళా జడ్జిలకు కూడా వేధింపులు తప్పలేదు. నువ్వు స్నానం చేస్తుండగా తీసిన నగ్న ఫోటోలు తన వద్ద ఉన్నాయని బ్లాక్ మెయిల్ చేసిన వ్యక్తి హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసుల చేతికి చిక్కాడు. వివరాల్లోకి వెళితే.. నగరంలోని నార్త్స్టార్స్ హోమ్స్ సంస్థలో లీగల్ అడ్వైజర్గా పనిచేస్తున్న మహేశ్ అనే వ్యక్తి.. 2010లో ఓ మహిళా జడ్జి వద్ద జూనియర్ అడ్వకేట్గా పనిచేశాడు. అప్పట్లో ఆమె కుటుంబానికి సన్నిహితంగా ఉండిన మహేష్.. ఆమెతో పాటు ఆమె పిల్లల ఫోటోలను తన వద్ద ఉంచుకున్నాడు.
అయితే కొన్నాళ్లు అయ్యాక తన వద్ద నగ్న ఫోటోలున్నాయని జడ్జిని బెదిరించాడు. ఉద్యోగం తీసేయడం పగ పెంచుకున్న మహేష్.. మహిళా జడ్జి పేరుతో ఓ నకిలీ ఫేస్ బుక్ ఖాతాను తెరిచి తన వద్ద ఉన్న జడ్జి, ఆమె పిల్లల ఫొటోలు అప్లోడ్ చేశాడు. ఇంకా డబ్బు కోసం బ్లాక్ మెయిల్ చేయడం మొదలెట్టాడు. అయితే జడ్జి కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మహేష్పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.