శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By selvi
Last Updated : శనివారం, 18 ఆగస్టు 2018 (14:42 IST)

హైదరాబాదులో హైటెక్‌ పద్ధతిలో ''ఆ'' దందా.. ఇతర రాష్ట్రాల అమ్మాయిలతో?

చికాగో సెక్స్ రాకెట్ తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. తాజాగా హైదరాబాదులో హైటెక్ పద్దతిలో వ్యభిచారాన్ని నిర్వహిస్తున్న ఓ ముఠాను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ వ్యభిచార న

చికాగో సెక్స్ రాకెట్ తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. తాజాగా హైదరాబాదులో హైటెక్ పద్దతిలో వ్యభిచారాన్ని నిర్వహిస్తున్న ఓ ముఠాను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ వ్యభిచార నిర్వహకుల నుండి ఇతర రాష్ట్రాలకు చెందిన ముగ్గురు అమ్మాయిలను కాపాడారు. ఈ వ్యభిచార గృహ నిర్వహకుడైన ఓ 24 ఏళ్ల యువకుడితో పాటు ఇద్దరు విటులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 
 
వివరాల్లోకి వెళితే.. కరీంనగర్ జిల్లాకు చెందిన భరత్ రెడ్డి(24) అనే యువకుడు శిరీష అనే మహిళ సాయంతో ఈ వ్యభిచార గృహాన్ని నిర్వహిస్తున్నాడు. వీరు న్యూ బోయిన్ పల్లి ప్రాంతంలోని జయా ఎన్ క్లేవ్ జె.ఎస్.ఆర్ రెసిడెన్సీలో ఓ ప్లాట్‌ను అద్దెకు తీసుకుని ఈ వ్యవహారాన్ని నడిపిస్తున్నారు. శిరీష ఇతర రాష్ట్రాల నుండి అమ్మాయిలను తీసుకువచ్చి భరత్‌కు అప్పగించేది.
 
అతడు ఆ అమ్మాయిలను విటుల వద్దకు పంపించడం, విటులనే ఈ ప్లాట్‌కు రప్పించడం చేసేవాడు. ఈ సమాచారం అందుకున్న టాస్క్ ఫోర్స్ రైడ్‌లో ఈ బాగోతాన్ని వెలుగులోకి తెచ్చారు. ఈ ముఠా భారి నుండి ముగ్గురు మహిళల్ని కాపాడిన పోలీసులు వారిని షెల్టర్ హోంకు తరలించారు. నిర్వహకుడు భరత్ రెడ్డితో పాటు విటులు జల్లి బాలపడిగ రావు(44),  ఉప్పలపాటి ఆకాశ్(24)లను అరెస్ట్ చేశారు. ఈ వ్యభిచార గృహాన్ని పోలీసులు సీజ్ చేశారు.