మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 24 సెప్టెంబరు 2017 (18:12 IST)

వివాహేతర బంధం.. ఆమెను గొడ్డలితో నరికి ఆత్మహత్య చేసుకున్న యువకుడు

తెలంగాణ రాష్ట్రంలో వివాహేతర సంబంధం ఇద్దరి ప్రాణాలను బలి తీసుకుంది. వివాహితను హత్య చేసిన యువకుడు తానూ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన ఆదిలాబాద్‌ జిల్లా గుడిహత్నూర్‌ మండలం ధంపూర్‌ శివారులో జరిగ

తెలంగాణ రాష్ట్రంలో వివాహేతర సంబంధం ఇద్దరి ప్రాణాలను బలి తీసుకుంది. వివాహితను హత్య చేసిన యువకుడు తానూ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన ఆదిలాబాద్‌ జిల్లా గుడిహత్నూర్‌ మండలం ధంపూర్‌ శివారులో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే.. కొలాంగూడకు చెందిన వివాహిత మడావి సునీత(41), ఇదే గ్రామానికి చెందిన టేకం గోవింద్‌(26)కు మధ్య కొంతకాలంగా వివాహేతర సంబంధం ఉంది. అయితే, వీరి బంధానికి సునీత భర్త అడ్డొస్తున్నాడనీ భావించి ఈనెల 21వ తేదీన ఇంట్లో నుంచి వెళ్లిపోయారు. 
 
దీంతో సునీత భర్త నాగోరావ్‌ శుక్రవారం స్థానిక పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో శనివారం వారిద్దరి మృతదేహాలు కొలాంగూడ గ్రామానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న పత్తిచేనులోని గుడిసెలో కనిపించాయి. సునీత, గోవింద్‌ శుక్రవారం రాత్రి చేను వద్దకు వచ్చినట్లు తెలుస్తోంది. ఇంటికి వెళ్తే పరిణామాలు ఏ విధంగా ఉంటాయోననే భయంతో వీరు ఆత్మహత్య చేసుకుని వుంటారని పోలీసులు భావిస్తున్నారు. 
 
సునీత చీరతో చేరో వైపు ఉరేసుకోవాలని ఏర్పాటు చేసిన ఆనవాళ్లు ఉన్నాయి. ఉరికి సునీత అంగీకరించకపోవడంతో అక్కడే ఉన్న గొడ్డలితో ఆమె గొంతుపై నరికి ఆ తర్వాత గోవింద్‌ ఆత్మహత్య చేసుకుని ఉంటాడని భావిస్తున్నారు. సునీతకు కూతురు, కుమారుడు ఉన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.