శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 30 జులై 2015 (20:05 IST)

ఢిల్లీలో ఆమరణ దీక్ష చేపట్టనున్న జగన్: జంతర్ మంతర్ వేదికగా..?

వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి త్వరలో ఢిల్లీ దీక్ష చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఈ దీక్ష ఆమరణ దీక్ష చేపట్టనున్నట్లు తెలిసిందే. హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో గురువారం జరిగిన వైసీపీ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 10నగానీ, ఆగస్టు 15 తరువాతగానీ జంతర్ మంతర్ వద్ద జగన్ దీక్ష చేసే అవకాశం ఉంది.
 
కాగా ప్రత్యేక హోదాపై కేంద్రం నిర్ణయం ప్రకటించడంలో జాప్యం చేస్తోంది. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన అవసరం లేదనే సంకేతాలు కేంద్రం నుంచి వస్తున్నాయి. ఇప్పటికే ప్రత్యేక హోదాపై సినీ నటుడు శివాజీ దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. అలాగే జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ కూడా ప్రత్యేక హోదాపై కేంద్రాన్ని ఎంపీలు ప్రశ్నించాలని నిలదీసిన సంగతి విదితమే.