శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 31 జులై 2014 (18:23 IST)

ఎన్నికల్లో గెలిచేంత సీన్ టీడీపీ లేదు: జగన్ ఎద్దేవా

ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుపై వైకాపా అధినేత జగన్మోహన్ మరోసారి ఫైర్ అయ్యారు. ఎన్నికల్లో గెలిచేంత సీన్ టీడీపీ లేదని జగన్ ఎద్దేవా చేశారు. కేవలం చంద్రబాబు మోసపూరిత మాటలు, నరేంద్ర మోడీ గాలి వల్లే ఆ పార్టీ అధికారంలోకి వచ్చిందని ఎద్దేవా చేశారు. దీనికితోడు ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ9 ఒక్కటై ప్రచారం చేసి టీడీపీని అధికారపీఠంపై కూర్చోబెట్టాయని ఆరోపించారు. 
 
అసత్య ప్రచారాలు, మోసపూరిత హామీలను తాను కూడా ఇచ్చి ఉంటే వైకాపా అధికారంలోకి వచ్చి ఉండేదని జగన్ చెప్పారు. రానున్న రోజుల్లో చంద్రబాబుకు ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. రెండు రోజుల గుంటూరు జిల్లా పర్యటనకు గాను జగన్ గుంటూరు చేరుకున్నారు. గుంటూరు పర్యటనలో భాగంగా అమరావతి రోడ్డులోని బండ్లమూడి గార్డెన్స్‌లో గుంటూరు జిల్లాలోని నియోజకవర్గాల వారీగా జగన్ సమీక్ష నిర్వహించనున్నారు.