శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PYR
Last Modified: శుక్రవారం, 6 మార్చి 2015 (22:22 IST)

జనసేన పార్టీ ఓ ధనసేన : వైఎస్ఆర్సీపీ

పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ ఓ ధనసేనని ఆ పార్టీ త్వరలోనే కనుమరుగు అవుతుందని వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖపట్టణం శాఖ అధ్యక్షుడు గుడివాడ అమరనాథ్ తెలిపారు. రాజకీయ వ్యవస్థను ప్రశ్నించడానికే తన పార్టీ పుట్టుకొచ్చిందనే చెప్పుకునే పవన్ కళ్యాణ్ పార్టీ ఇంత వరకూ ఎన్ని ప్రశ్నలు వేసిందో చెప్పాలని ఆయన కోరారు. 
 
శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ ప్రజలను నిలువునా ముంచుతున్న చంద్రబాబు నాయుడు రాసిన పాటాన్ని పవన్ కళ్యాణ్ చదువుతున్నాడే తప్ప ఆయన సొంతంగా తయారు చేసుకున్న ఎజెండా ప్రశ్నలు ఏమి లేవని ఎద్దేవా చేశారు. కేవలం చంద్రబాబు ఏమి చెబితే అలా నటిస్తున్నారే తప్ప, పవన్ కళ్యాణ్ కు ప్రత్యేక ఆలోచనలు ఏమి లేవని  విమర్శించారు. 
 
అలాకాకపోతే, అధికారంలో ఉన్నవారిని ప్రశ్నించాల్సిందిపోయి దివంగత నేత రాజశేఖర్ రెడ్డి పదే పదే విమర్శించడంలో అర్థం ఏంటని ఆయన పవన్ ను ప్రశ్నించారు. కేవలం 24 గంటలలో పవన్లో మార్పులు కనిపిస్తున్నాయని అందుకే ఆయన పార్టీ పేరును జనసేనకు బదులుగా ధనసేన అని మార్చుకుంటే బాగుంటుందని సలహా ఇచ్చారు.