శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ivr
Last Modified: బుధవారం, 30 జులై 2014 (18:02 IST)

జనసేన పవన్‌పై టి.సీఎం కేసీఆర్ వ్యాఖ్యలు.. కోర్టు ఆదేశాలు..

ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జనసేన చీఫ్, సినీ నటుడు పవన్ కళ్యాణ్‌పై చేసిన వివాదాస్పద వ్యాఖ్యల కేసు గురించి అనంతపురం కోర్టు స్పందించిన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్‌పై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి 15 రోజుల్లోగా విచారణ పూర్తి చేయాలనీ, దానికి సంబంధించిన పూర్తి నివేదికను అందించాలని అనంతపురం కోర్టు ఆదేశించింది.
 
కాగా ఈ కేసుకు సంబంధించి పోలీసులు బుధవారం తమ తుది నివేదికను సమర్పించవలసి ఉంది. అయితే, తమకు మరికొంత సమయం కావాలని పోలీసులు కోర్టును కోరారు. దీంతో కేసు నమోదు చేసిన న్యాయవాది మురళీ కృష్ణ వాదనను కోర్టు నమోదు చేసింది. ఈ కేసుకు సంబంధించి కేసీఆర్ పైన పలు సెక్షన్ల కింద కేసు నమోదయింది.