శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 17 అక్టోబరు 2014 (19:10 IST)

ఆ నలుగురికి ఉరిశిక్ష: గోదావరిఖని సెషన్ కోర్టు తీర్పు

కరీంనగర్ గోదావరిఖని సెషన్ కోర్టు సంచలన తీర్పునిచ్చింది. భార్య, కుమార్తె, అత్తమామలను చంపిన కేసులో గోదావరి సెషన్ కోర్టు నలుగురికి ఉరిశిక్ష విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది. 
 
2010 మార్చి 27న అక్రమ సంబంధం నెపంతో ఆ నలుగుర్నీ నిందితుడు హత్య చేశాడు. దీంతో అతడికి ఉరిశిక్ష విధించిన న్యాయమూర్తి, వారిని అంతమొందించేందుకు సహకరించిన మరో ముగ్గురికి కూడా ఉరిశిక్షను ఖరారు చేస్తూ తీర్పును వెలువరించారు.