ఆ నలుగురికి ఉరిశిక్ష: గోదావరిఖని సెషన్ కోర్టు తీర్పు
కరీంనగర్ గోదావరిఖని సెషన్ కోర్టు సంచలన తీర్పునిచ్చింది. భార్య, కుమార్తె, అత్తమామలను చంపిన కేసులో గోదావరి సెషన్ కోర్టు నలుగురికి ఉరిశిక్ష విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.
2010 మార్చి 27న అక్రమ సంబంధం నెపంతో ఆ నలుగుర్నీ నిందితుడు హత్య చేశాడు. దీంతో అతడికి ఉరిశిక్ష విధించిన న్యాయమూర్తి, వారిని అంతమొందించేందుకు సహకరించిన మరో ముగ్గురికి కూడా ఉరిశిక్షను ఖరారు చేస్తూ తీర్పును వెలువరించారు.