శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By JSK
Last Modified: శనివారం, 30 జులై 2016 (21:29 IST)

పుష్కరాలలో ఉద్యోగులు గోవిందా.. గోవిందా అనాలా...?!

విజ‌య‌వాడ ‌: ఏపి ప్రభుత్వం పుష్కరాలలో కొత్త సంప్రదాయం సృష్టించాలని ఏపీ ప్ర‌భుత్వం భావిస్తోంది. పుష్కర విధులలో ఉండే ఉద్యోగులు నిర్దిష్ట డ్రెస్ ధరించి ఓం నమశ్శివాయ.... గోవింద.. గోవింద అని అనాలని ఆదేశించింది. ప్రభుత్వ ఉద్యోగులు ఖచ్చితంగా తెల్ల పంచె, కండ

విజ‌య‌వాడ ‌: ఏపి ప్రభుత్వం పుష్కరాలలో కొత్త సంప్రదాయం సృష్టించాలని ఏపీ ప్ర‌భుత్వం భావిస్తోంది. పుష్కర విధులలో ఉండే ఉద్యోగులు నిర్దిష్ట డ్రెస్ ధరించి ఓం నమశ్శివాయ.... గోవింద.. గోవింద అని అనాలని ఆదేశించింది. ప్రభుత్వ ఉద్యోగులు ఖచ్చితంగా తెల్ల పంచె, కండువా, మహిళలైతే చీరలు ధరించాలి. ఇలాంటి ఉత్తర్వులు ఇతర మతాలకు చెందిన ఉద్యోగుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని సిపిఎం ఏపి కార్యదర్శి మధు అన్నారు. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక లేఖ రాస్తూ ఈ ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని సూచించారు.
 
భక్తులను మర్యాదపూర్వకంగా పలకరించడం, వారికి అవసరమైన సూచనలు ఇవ్వడంలో అభ్యంతరం లేదని, కాని ఓం నమశ్శివాయా.. గోవింద.. గోవిందా అని సంబోధించడం సమంజసంగా లేదని మధు అన్నారు. అంతేకాక ఉద్యోగులు బొట్టును, విభూది పెట్టుకోవాలన్న నిబంధన కూడా సరికాదని ఆయన అన్నారు. ఇవన్నీ ఒక మత అభిప్రాయాలను ఇతరులపై రుద్దడం అవుతుందని అన్నారు. ఉద్యోగులకు బ్యాడ్జీలు పెట్టాలని ఆయన సూచించారు.