శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 28 జనవరి 2015 (11:59 IST)

కాంగ్రెస్-టీడీపీల మధ్య ఘర్షణ: ఒకరు మృతి!

ఏపీలో రాజకీయ కక్షలకు ఒక వ్యక్తి బలైపోయాడు. అయితే ఇది ప్రదాన ప్రతిపక్షానికి, అధికార పక్షానికి మధ్య తగాదా కాకుండా కాంగ్రెస్, టీడీపీల మధ్య ఘర్షణలో ఒకరు మృతి చెందారు. 
 
డోన్ మండలం కొత్తబురుజులో కాంగ్రెస్, టీడీపీ వర్గీయుల మధ్య ఘర్షణలు జరగ్గా శాంతిరాజు అనే వ్యక్తి మరణించాడు. 
 
అతను ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నట్లు చెబుతున్నారు. దీనికి రాజకీయ కారణాలా?లేక పాత కక్షల కారణమా అనేది తెలియాల్సి వుంది.