శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 6 మార్చి 2015 (17:00 IST)

రాజధాని భూములపై రైతుల్ని రెచ్చగొట్టొద్దు ప్లీజ్: మంత్రి నారాయణ

రాజధాని భూములపై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయవద్దని ఆంధ్రప్రదేశ్ మంత్రి నారాయణ అన్నారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే నష్టపోయేది రైతులేనని నారాయణ పేర్కొన్నారు. 2018 నాటికి రాజధాని నిర్మాణం పూర్తి చేస్తామని, చట్టభద్రత ప్రకారమే రైతులకు భూముల్లో భాగస్వామ్యం ఉంటుందని మంత్రి తెలిపారు.
 
నవ్యాంధ్ర రాజధాని ప్రాంతంలో ఎవరైనా పర్యటించవచ్చని ఏపీ మంత్రి నారాయణ అన్నారు. అయితే, అక్కడివారిని రెచ్చగొట్టేవిధంగా వ్యాఖ్యలు చేయవద్దని సూచించారు. 
 
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేకున్నా రైతులకు మంచి ప్యాకేజీ ఇచ్చామని, సంతోషంగా ఉన్నామని రైతులంతా చెప్పారన్నారు. 2018 జూన్ నాటికి రాజధాని నిర్మాణం తొలి దశ పూర్తవుతుందని చెప్పిన మంత్రి, 20 ఏళ్లలో రాజధాని నిర్మాణం పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. రాజధాని కోసం భూసేకరణ దాదాపు పూర్తయిందన్న మంత్రి, ఇంకా 700 ఎకరాలు సేకరించాల్సి ఉందని వెల్లడించారు.