శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 20 అక్టోబరు 2014 (19:45 IST)

హుదూద్: చంద్రబాబుకు మహేష్ డాడ్ కృష్ణ రూ.50లక్షల చెక్!

హుదూద్ తుపాను బాధితుల సహాయార్థం సినీనటులు కృష్ణ దంపతులు రూ.50 లక్షల చెక్కును ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు అందజేశారు. సచివాలయంలో చంద్రబాబును కలిసిన కృష్ణ దంపతులు టాలీవుడ్ ప్రిన్స్ హీరో మహేష్ బాబు ప్రకటించిన రూ.25లక్షలను, తమ విరాళం మరో రూ.25లక్షలను కలిపి మొత్తం రూ. 50లక్షల చెక్కును చంద్రబాబుకు అందజేశారు. ఇదే సమయంలో, అమర్ రాజా బ్యాటరీస్ తరపున రూ. కోటి చెక్కును చంద్రబాబుకు గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ అందజేశారు. 
 
అనంతరం కృష్ణ మాట్లాడుతూ.. తుపాను వల్ల విశాఖకు తీరని నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశారు. మానవతా వాదులందరు ముందుకు వచ్చి... తుపాను బాధితులను ఆదుకోవడానికి సహాయ సహకారాలు అందించాలని విజ్ఞప్తి చేశారు. మహేష్ హాంకాంగ్‌లో ఉన్నందున రాలేకపోయాడని కృష్ణ వెల్లడించారు.