శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By CVR
Last Updated : మంగళవారం, 31 మార్చి 2015 (16:20 IST)

గుంటూరులో భూ ప్రకంపనలు... భూకంప జోన్‌లో ఆంధ్ర కొత్త రాజధాని...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లాలో మంగళవారం నాడు భూమి కంపించింది. ఇక్కడి శ్యామలాపురం ప్రాంతంలో హఠాత్తుగా భూమి కంపించడంతో ఇళ్లు స్వల్పంగా కంపించాయి. దీంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. ఇళ్ల నుంచి రోడ్లపైకి పరుగులు తీశారు. కొన్ని సెకన్ల పాటు ఈ ప్రకంపనలు వచ్చాయి.
 
కాగా, గుంటూరు జిల్లాలోని కృష్ణానదీ పరివాహక ప్రాంతాలతో పాటు, కొన్ని ఇతర ప్రాంతాలు కూడా ప్రమాదకర భూకంపాల జోన్లలో ఉన్నాయని భూగర్భ శాస్త్ర నిపుణులు ఇంతకుముందే చెప్పారు. ఆంధ్రా రాజధాని ప్రాంతం కూడా ఇదే జోన్లో ఉన్నట్టు వారు వివరించారు. ఈ విషయాన్ని వారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి కూడా తెలిపినట్టు సమాచారం.