1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 17 సెప్టెంబరు 2018 (13:39 IST)

బోనాల పండక్కి అమ్మమ్మ ఇంటికెళ్తే బాలికను పొలాల్లోకి లాక్కెళ్లి...

తెలంగాణ రాష్ట్రంలో ఓ మైనర్ బాలిక అత్యాచారానికి గురైంది. ప్రేమ పేరుతో ఓ యువకుడు మైనర్ బాలికను బలవంతంగా పొలాల్లోకి తీసుకెళ్లి రేప్ చేశాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...

తెలంగాణ రాష్ట్రంలో ఓ మైనర్ బాలిక అత్యాచారానికి గురైంది. ప్రేమ పేరుతో ఓ యువకుడు మైనర్ బాలికను బలవంతంగా పొలాల్లోకి తీసుకెళ్లి రేప్ చేశాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...
 
ప్రేమ పేరుతో ఓ మైనర్‌ బాలిక వెంట పడుతున్న యువకుడు అవకాశం చూసుకుని ఆమెను పొలాల్లోకి బలవంతంగా లాక్కెళ్లి లైంగిక దాడికి పాల్పడిన ఘటన వెలుగుచూసింది. పోలీసుల కథనం మేరకు... 
 
తెలంగాణలోని సిద్ధిపేట జిల్లా శివరంపురానికి చెందిన ఓ కుటుంబం నగరానికి వలస వచ్చింది. బాలిక తండ్రి రామకృష్ణాపురంలోని ఓ అపార్ట్‌మెంట్లో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. బాధితురాలు తొమ్మిదో తరగతి చదువుతోంది. ఈ క్రమంలో అదేగ్రామానికి చెందిన రాజు (25) కొన్నాళ్లుగా ప్రేమ పేరుతో బాలికను వేధిస్తూ వచ్చాడు. 
 
ఈ నేపథ్యంలో ఇటీవల బాధిత బాలిక బోనాలకు సిద్ధిపేటలోని అమ్మమ్మ ఇంటికి వెళ్లింది. ఇదే అదనుగా భావించిన రాజు ఆ ఊరెళ్ళాడు. ఎవరూ లేని సమయంలో బాలికను సమీపంలోని పొలాల్లోకి తీసుకువెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఇది తెలిసిన బాలిక తల్లిదండ్రులు నేరేడ్‌మెట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.