శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 22 సెప్టెంబరు 2014 (12:38 IST)

కిరణ్ కుమార్ రెడ్డి రీ ఎంట్రీ: బీజేపీలో చేరనున్న కేకేఆర్!

సమైక్యాంధ్ర మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి మళ్లీ రాజకీయాల్లో రెండో ఇన్నింగ్స్ ఆరంభించనున్నారు. మళ్లీ క్రియాశీల రాజకీయాల్లోకి అడుగుపెట్టాలని మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి భావిస్తున్నారు. 
 
ఈ నేపథ్యంలో, ఆయన భారతీయ జనతా పార్టీలో చేరడానికి సుముఖంగానే ఉన్నారని సమాచారం. అయితే, ఆ పార్టీలోకి వెళ్లడానికి ఆయన ఒక షరతు పెడుతున్నారు. బీజేపీ కేంద్ర నాయకత్వం నుంచి తనకు ఆహ్వానం అందాలని, ఆ తర్వాత తనకు పార్టీలో గౌరవప్రదమైన స్థానం ఇవ్వాలని ఆయన ఆశిస్తున్నారు.
 
ఇటీవలే, అమెరికాలో కొంతకాలం పాటు విశ్రాంతి తీసుకుని కిరణ్ హైదరాబాద్‌కు తిరిగి వచ్చారు. ప్రస్తుతం ఆయన విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వచ్చిన ఆర్థిక, రాజకీయ, సామాజిక పరిణామాలను అధ్యయనం చేస్తోన్నట్టు సమాచారం.