శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ivr
Last Modified: మంగళవారం, 4 ఆగస్టు 2015 (13:57 IST)

'సీతయ్య' ఫైర్... వనజాక్షికి బెదిరింపా...? రిషితేశ్వరి మృతికి కారకులెవరు..?

సీతయ్య అనే పేరు చెప్పగానే చటుక్కున గుర్తుకు వచ్చేది నందమూరి హరికృష్ణ. ఆయన గత కొంతకాలంగా మౌనాన్ని పాటిస్తూ వస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పగ్గాలు చేపట్టినప్పటికీ ఆయనకు తగిన పదవి లభించలేదనే విమర్శలున్నాయి. ఐతే వాటిపై ఆయన బహిరంగంగా ఏమీ మాట్లాడటం లేదు. కొంతకాలంగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఐతే మంగళవారం నాడు ఆయన రెండుమూడు విషయాలపై మాట్లాడారు.
 
కృష్ణా జిల్లా ముసునూరు ఎమ్మార్వో వనజాక్షికి బెదిరింపు లేఖ రావడాన్ని హరికృష్ణ ఖండించారు. ఆమెకు అండగా ఉంటామని ప్రకటించారు. ఆమెకు బెదిరింపు లేఖ రాసింది ఎవరో కనుగొని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే నాగార్జున విశ్వవిద్యాలయంలో బలవన్మరణానికి పాల్పడ్డ రిషితేశ్వరి మరణానికి కారకులను పట్టుకుని శిక్షించాలని కోరారు.