పవనూ... ప్రత్యక్షంగా పట్టుబడ్డ వారి సంగతి మాట్లాడవయ్యా... హరీష్ రావు
పవన్ అసలు విషయాన్ని వదిలేసి ఓటుకు నోటు కేసులో ఇతర విషయాలను మాట్లాడుతున్నారని తెలంగాణ భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. నేరుగ పట్టుబడ్డ వారిపై తన అభిప్రాయాలను గాలికి వదిలేసి సండ్ర వీరయ్య గురించి మాట్లాడడం ఏంటని ప్రశ్నించారు. పవన్ తన స్థాయికి తగిన విధంగా మాట్లాడాలని హితవు పలికారు.
మెదక్ జిల్లా పుల్కల్ మండలం సింగూరులో ఆయన విలేకరులతో మాట్లాడారు.ఓటుకు నోటు కేసులో ఖమ్మం ఎమ్మెల్యే సండ్ర వీరయ్యను ఉద్దేశపూర్వకంగానే ఏసీబీ పోలీసులు అరెస్ట్ చేశారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ విమర్శించడం సరైంది కాదని అన్నారు.
రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డ టీడీపీపై వ్యాఖ్యానించకుండా టీఆర్ఎస్ టార్గెట్గా విమర్శలు చేయడం పవన్కు తగదన్నారు. పవన్ కల్యాణ్ తన స్థాయిని గుర్తించి మాట్లాడాలని సూచించారు. ఓ వైపు తెలంగాణ సీఎం కేసీఆర్ను అభినందిస్తూనే మరోవైపు విమర్శించడం భావ్యం కాదన్నారు.