శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 5 మార్చి 2015 (11:01 IST)

రైతు కన్నీటితో వచ్చే రాజధాని అవసరం లేదు: పవన్ కల్యాణ్

రైతు కన్నీటితో వచ్చే రాజధాని అవసరం లేదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. రైతు కన్నీరు పెడితే ఆ శోకం రాజధానికి తగులుతుందన్నారు. ల్యాండ్ పూలింగ్ నిలిపివేయాలని మంత్రులు నారాయణ, ప్రత్తిపాటిని కోరుతున్నానని చెప్పారు. రైతుల సమస్యలు తెలుసుకునేందుకే వచ్చానని, రైతులకు అండగా ఉంటానని అన్నారు. డెడ్ లైన్లు పెట్టి ఉండవల్లి గ్రామంలోని రైతుల భూములను తీసుకోవద్దని పవన్ సూచించారు.
 
రాజధాని ప్రాంత గ్రామాల్లో పర్యటిస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉండవల్లి గ్రామంలో ప్రసంగించారు. ఈ సందర్భంగా భారీ ఎత్తున పవన్ అభిమానులు, రైతులు సభావేదిక వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ, రైతు కన్నీటితో వచ్చే రాజధాని అవసరం లేదని చెప్పారు. తనకు కూడా గొప్ప రాజధాని రావాలనే కోరిక బలంగా ఉందని చెప్పారు.