శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 12 సెప్టెంబరు 2016 (12:49 IST)

చిత్తూరు జిల్లాలో వ్యభిచార గృహాలపై దాడులు -13 మంది అరెస్ట్

చిత్తూరు జిల్లా మదనపల్లె పరిసర ప్రాంతాల్లో వ్యభిచార గృహాలపై పోలీసులు సోమవారం ఆకస్మిక దాడులు చేశారు. ఈ సందర్భంగా వ్యభిచార గృహాలు నడుపుతున్న 13 మంది నిర్వాహకులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.40 వే

చిత్తూరు జిల్లా మదనపల్లె పరిసర ప్రాంతాల్లో వ్యభిచార గృహాలపై పోలీసులు సోమవారం ఆకస్మిక దాడులు చేశారు. ఈ సందర్భంగా వ్యభిచార గృహాలు నడుపుతున్న 13 మంది నిర్వాహకులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.40 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. చాలాకాలంగా సాగుతున్న ఈ వ్యవహారం మూలాలు కర్ణాటక రాజధాని బెంగళూరు, ఏపీలోని అనంతపురం జిల్లాల్లోనూ ఉన్నాయి. 
 
ఈ మేరకు పక్కా సమాచారం సేకరించిన చిత్తూరు జిల్లా పోలీసులు ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు జిల్లాలోని మదనపల్లి, పుంగనూరు, పొరుగునే ఉన్న అనంతపురం, ఆ జిల్లాలోని కదిరి, బెంగళూరులో ఏకకాలంలో దాడులు చేశారు. ఈ దాడుల్లో భాగంగా 38 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో 13 మంది నిర్వాహకులు, ఐదుగురు బ్రోకర్లు, 9 మంది విటులు, 11 మంది సెక్స్ వర్కర్లు ఉన్నారు.