గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: బుధవారం, 13 మార్చి 2019 (18:55 IST)

ఓడిపోయే సీటు కుమారుడికి ఇచ్చిన చంద్రబాబు..? గెలిచి సత్తా చాటుతానంటున్న లోకేష్.?

నారా లోకేష్‌. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కుమారుడిగా మంత్రి పదవిని ప్రస్తుతం అనుభవిస్తున్నారు. అయితే కుమారుడిని ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేయించాలన్నది తండ్రి ఆలోచన. అంతేకాదు ఎలాగైనా గెలిపించి తీరాలన్న పట్టుదలతో ఉన్నారు చంద్రబాబు. ఈజీగా గెలిచే సీటు కాదు.. సవాల్‌గా తీసుకొని గెలిపించాలని కుమారుడికి సీటివ్వబోతున్నారు చంద్రబాబు.
 
ప్రస్తుతం లోకేష్‌ పోటీ చేస్తున్న ప్రాంతం మంగళగిరి. ఈ స్థానంలో ఇప్పటికే వైసిపి ఎమ్మెల్యే ఆర్కే బరిలో ఉన్నారు. గత ఎన్నికల్లో 12 ఓట్ల తేడాతో ఈయన గెలుపొందారు. బలమైన వర్గం బిసిలు ఉన్న ప్రాంతం ఇది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి 1983, 1985 మినహా టిడిపి ఎమ్మెల్యే లేని నియోజకవర్గంగా మంగళగిరి ఉంది. 
 
పొత్తుల్లో భాగంగా ప్రతి ఎన్నికల్లో లెఫ్ట్ పార్టీలు, బిజెపికే కట్టబెడుతూ వచ్చారు చంద్రబాబు. కానీ ఇప్పుడు లోకేష్‌ బాబును అదే స్థానం నుంచి రంగంలోకి దింపుతున్నారు. 66 వేల ఓట్లు ఉన్న బిసి వర్గానికి చెందిన ప్రజలే ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపును నిర్ధేశిస్తారు. టిడిపి బిసి పక్షపాతి కావడంతో ఖచ్చితంగా గెలుపు తనదేనన్న ధీమాలో టిడిపి నేతలు ఉన్నారు.
 
కానీ గెలుపు అంత సుళువు కాదని లోకేష్‌ చెబుతున్నారట. సవాల్‌గా తీసుకుని తన తండ్రి కేటాయించిన నియోజకవర్గంలో గెలిచి తీరుతానని లోకేష్‌ చెబుతున్నారట. మరి చూడాలి... లోకేష్‌‌ను మంగళగిరి ప్రజలు ఏమాత్రం ఆదరిస్తారో.