శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pyr
Last Updated : మంగళవారం, 28 జులై 2015 (08:57 IST)

ఎవరా.. పాప..? ఎలా చనిపోయింది..?

చిన్న పాప.. మహా అంటే ఆరెళ్ళ వయస్సు ఉంటుంది. ఈ ప్రపంచంపై పూర్తి అవగాహనే ఉండదు. ఆ పాప ఎవరికి భారమయ్యిందో.. లేదా ఏ రాక్షసుడి దాహానికి బలయ్యిందో తెలియదు. మృతదేహంగా మారింది. అక్కడకు వెళ్ళిన ఆ బావి యజమానికి శవమై కనిపించింది. విజయనగరం జిల్లాలో జరిగిన సంఘటన వివరాలిలా ఉన్నాయి. 
 
విజయనగరం పట్టణంలోని కొత్తపేట గొల్లవీధి సమీపంలో ఉన్న బావిలో ఆరేళ్ల బాలిక మృతదేహం లభ్యమైంది. మంగళవారం ఉదయం తమ్మిడి రమేశ్‌ అనే వ్యక్తి బావి దగ్గరకు వెళ్లగా పాప మృతదేహం కనిపించింది. వెంటనే ఆయన రెండో పట్టణ పోలీసులకు సమాచారమందించారు. 
 
పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి గుర్తు తెలియని బాలిక అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టరం నిమిత్తం విజయనగరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.